telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ..ఇద్దరు విద్యార్థుల మృతి

Accident

హైదరాబాద్ ఉప్పల్ లిటిల్ ఫ్లవర్ కాలేజీ చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న ఆటోను ఇసుక లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా..ఆరుగురికి గాయాలయ్యాయి. మరో ముగ్గురు క్షేమంగా ఉన్నారు. హబ్సిగూడ భాష్యం స్కూల్ చెందిన విద్యార్థులు ఆటోలో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. గాయాలైన విద్యార్థులను వెంటనే సికింద్రాబాద్ ఆస్పత్రికి తరలించారు.

ఈ ప్రమాదంలో విద్యార్థుల టిఫిన్ బాక్సులు, షూలు చెప్పులు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. విద్యార్థుల తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ప్రమాదంతో హప్సిగూడ రహదారిలోని లిటిల్ ఫ్లవర్ కళాశాల వద్ద విషాద వాతావరణం నెలకొంది. ఈ ఘటన జరిగిన వెంటనే ఇసుక లారీ డ్రైవర్ లారీని వదిలి పెట్టి పరారయ్యాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts