telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. 20మందికి గాయాలు

Road accident 8 dead and 30 injured

కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నుస్తులపూర్ వద్ద రాజీవ్ రహదారిఫై ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సులో ఉన్న 20 మంది ప్రయాణీకులకు గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ దుర్ఘటనపై రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ఆరా తీశారు. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆర్టీసిని ఆదేశించారు. బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Related posts