telugu navyamedia
రాజకీయ వార్తలు

వచ్చే ఎన్నికల్లో ఎంపీ గా పోటీ చేస్తా: శరద్ పవార్

Loksabha Elections MP Contest Sharad pawar

రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ, శివసేన పొత్తు నేపథ్యంలో తాను పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతానని నేషనల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తాను పార్లమెంటుకు పోటీ చేస్తానని ఆయన తెలిపారు. తన మేనల్లుడు అజిత్ పవార్ కాని ఇతర కుటుంబసభ్యులెవరూ ఈ ఎన్నికల్లో పోటీ చేయరని శరద్ పవార్ స్పష్టం చేశారు.

పవార్ మనవడు రోహిత్ పవార్ వారసుడిగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని పుకార్లు వ్యాపించిన నేపథ్యంలో పవార్ ఈ ప్రకటన చేశారు. బీజేపీ, శివసేన పొత్తు గురించి ఆయన మాట్లాడుతూ, మొన్నటి దాకా ఆ రెండు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకున్నాయని, కాని నేడు కలిశాయన్నారు. దీనిపై ప్రజలే నిర్ణయం తీసుకుంటారని పవార్ పేర్కొన్నారు.

Related posts