telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

ఇప్పటికి తేరుకున్న లోకేష్ .. అందుకే ఓడిపోయానంటూ ..

Minister Lokesh comments YS Jagan

నారా లోకేష్ మంగళగిరిలో తన ఓటమికి ఇప్పటికి సరైన కారణం కనుగొన్నారు.. కేవలం ప్రజలకు చేరువయ్యేందుకు సరిపడా సమయం లేకే తాను ఓడిపోయానని ఆయన అన్నారు. టిడిపి కార్యాలయంలో మీడియాతో ఆయన చిట్ చాట్ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్లు, విద్య, వైద్యం వంటి విషయాల్లో బాగా అభివృద్ధి చేసిన చోట కూడా ఓటమి పాలయ్యామని ఆవేదన వ్యక్తం చేశారు. ఓడిపోయినప్పటికీ ప్రజలకు న్యాయం చేసేందుకు ప్రజలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ విషయంలో పార్టీలోని ప్రతి కార్యకర్తను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

కేవలం నెల రోజుల్లో 6మంది తెదేపా కార్యకర్తలు హత్యకు గురయ్యారని కార్యకర్తలను కాపాడుకోవాలంటే ప్రభుత్వంపై పోరాటం తప్పదని లోకేష్ పిలుపునిచ్చారు. గతంలో కొత్త ప్రభుత్వం ఏర్పడితే కనీసం ఆరు నెలలు సమయం ప్రశ్నించేందుకు ఇచ్చే సంప్రదాయం ఉందని కానీ ప్రస్తుత ప్రభుత్వ పొరపాట్లు, ప్రజల ఇబ్బందులు చూస్తే అంత సమయం సరికాదనే భావన కలుగుతోందని లోకేష్ అన్నారు. ఐటి పరిశ్రమలు రాష్ట్రం నుంచి తిరుగుముఖం పడుతున్నాయని, ఒప్పందాలు చేసుకున్న ఎలక్ట్రానిక్స్ కంపెనీలు ఇపుడు వెనకడుగు వేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ నవరత్నాలు మాత్రమే అమలు అంటున్నారని, పాదయాత్రలో ఇచ్చిన 400 హామీల అమలు సంగతి చెప్పటం లేదని లోకేష్ విమర్శలు గుప్పించారు.

Related posts