telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పట్టాభిపై దాడి : అదరం.. బెదరం అంటూ లోకేష్‌ ట్వీట్‌

Nara Lokesh

టిడిపి జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి పై గుర్తు తెలియని కొందరు దుండగులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన కారు ధ్వంసం అవడమే కాక ఆయనకు తీవ్ర గాయలయ్యాయి. అయితే.. ఈ ఘటనపై టీడీపీ నేత నారా లోకేష్‌ వైసీపీ ఫైర్‌ అయ్యరు. వైసీపీకి తాము భయపడబోమని ట్విట్టర్‌ వేదికగా పేర్కొన్నారు. “టిడిపి జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి పై వైకాపా గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆధారాలతో సీఎం జగన్‌ అవినీతి పాలనను ఎండగడుతున్నారన్న కక్షతోనే పట్టాభిని ల‌క్ష్యంగా చేసుకుని జ‌గ‌న్‌రెడ్డే దాడులు చేయిస్తున్నారు. మంత్రులే చంపుతాం, ఇంటికొచ్చి కొడ‌తాం అని బెదిరించ‌డంపై పోలీసుల‌కు ఫిర్యాదుచేస్తే క‌నీసం ప‌ట్టించుకోలేదు. జాతీయ అధికార‌ప్ర‌తినిధి ప‌ట్టాభికి వైసీపీ మంత్రులే వార్నింగ్ ఇచ్చి మ‌రీ గూండాల‌తో దాడి చేయించారంటే ఎంత‌గా బ‌రి తెగించారో అర్థ‌మ‌వుతోంది. మీ బెదిరింపుల‌కు అద‌రం. మీ దాడుల‌కు బెద‌రం. మీ అరాచక‌‌పాల‌న‌ని అంత‌మొందించి తీరుతాం” అంటూ నారా లోకేష్‌ నిప్పులు చెరిగారు.

Related posts