టిఎన్ఎస్ఎఫ్ నాయకుల అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. ఏపీలో దారుణ పాలన కొనసాగుతోందని తెలిపారు లోకేష్. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. “విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే అరెస్టులా?టిఎన్ఎస్ఎఫ్ నాయకుల అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నాను. సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలనలో బడుగు,బలహీన వర్గాల విద్యార్థులుకు ఉన్నత విద్య చదువుకునే హక్కు లేదా? జీఓ 77 తీసుకొచ్చి వేలాది మంది విద్యార్థుల జీవితాలతో వైకాపా ప్రభుత్వం ఆటలాడుతుంది.ప్రైవేట్ కాలేజీల్లో చదివే పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేస్తూ ఇచ్చిన జీఓని రద్దు చెయ్యాలి. ప్రైవేట్ కాలేజీల్లో చదివే పీజీ చదివే విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని అమలు చెయ్యాలి.విద్యార్థి వ్యతిరేక నిర్ణయాలను వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తాం. ” అంటూ జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు నారా లోకేష్.
previous post
next post