telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అభివృద్ధిపై ఆశలు పోయినట్టే .. ఏపీ గురించి లోకేష్ ..

lokesh comments on jagan on security of

టీడీపీ నేత నారా లోకేశ్ ఏపీ సీఎం జగన్ పై విమర్శలు గుప్పించాడు. రాష్ట్రంలో అభివృద్ధిని అటకెక్కించి, టీడీపీపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్న వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ ప్రభుత్వంపై ప్రజల్లో అసహ్యం మొదలైందని, రానున్న ఐదేళ్లూ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోదని ప్రజలే స్వయంగా చెపుతున్నారని వ్యాఖ్యానిస్తూ ఓ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ పాలనపై విమర్శలు చేస్తున్న ఓ పెద్దాయన వీడియోను తన పోస్ట్ లో లోకేశ్ పొందుపరిచారు.

ఆ వీడియోలో పెద్దాయన, ఆంధ్రా పరిస్థితి ఏమీ బాగోలేదని, ప్రజలు చాలా మంది అసహ్యంగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. గత ఐదేళ్లలో టీడీపీ అభివృద్ధి చేసిందని, ఇంకో ఐదేళ్లు టీడీపీనే అధికారంలో ఉంటే మరింత అభివృద్ధి జరిగేదని అభిప్రాయపడ్డారు. కొత్త కంపెనీలు వచ్చేవని, యువతకు అవకాశాలు లభించేవని అన్నారు. ఏపీ అభివృద్ధి చెందాలంటే మన రాజకీయనాయకులు కష్టపడాలని సూచించారు.ఈ ఐదేళ్లలో అమరావతి అభివృద్ధి జరుగుతుందన్న నమ్మకం తమకు లేదని ఆయన అన్నారు.

Related posts