telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

తెలుగు విద్యార్థుల ర్యాంకుల పై లోకేశ్ హర్షం

Minister Lokesh comments YS Jagan

2019 విద్యాసంవత్సరంలో ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశానికి నిర్వహించిన జేఈఈ మెయిన్‌ పరీక్ష ఫలితాలు సోమవారం రాత్రి ప్రకటించారు. ఈ ఫలితాల్లో మరోసారి తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తాచాటడం పట్ల ఏపీ మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేస్తూ వరుస ట్వీట్లు చేశారు. జేఈఈ మెయిన్‌ తొలి 24 ర్యాంకుల్లో 6 ర్యాంకులు సాధించిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులు కార్తికేయ, సాయికిరణ్, విశ్వంత్, కొండా రేణు, జయంత్ ఫణి సాయి, చేతన్ రెడ్డిలకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే మొదటి వంద ర్యాంకుల్లో 40 ర్యాంకులను సొంతం చేసుకున్న విద్యార్థులతో పాటు, జేఈఈలో అర్హత సాధించిన తెలుగు విద్యార్థులందరికీ అభినందనలు. మీరంతా మున్ముందు మరిన్ని విజయాలను అందుకుని తెలుగు వారికి గర్వకారణంగా నిలవాలని కోరుకుంటున్నాను’ అంటూ లోకేశ్ తన ట్విటర్ లో పేర్కొన్నారు.

Related posts