telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జగనన్న చరిత్ర తెలుసుకున్న వరల్డ్ బ్యాంక్ ఇక సెలవంది: లోకేశ్

ఏపీకి ప్రపంచ బ్యాంకు నిధులు ఇవ్వమని చెప్పడంపై టీడీపీ నేతలు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీ నేత నారా లోకేశ్ ట్విటర్ వేదికాగా స్పందించారు. చంద్రబాబు హయాంలో కళకళలాడిన రాజధాని అమరావతి, జగన్ అధికారంలోకి వచ్చాక కళ తప్పిందన్నారు. ఆయన తుగ్లక్ చర్యలతో రాజధాని ఖాళీ అవుతోందని విమర్శిస్తూ వరుస ట్వీట్లు చేశారు.

జగనన్న వచ్చారు.. వరల్డ్ బ్యాంక్ పోయింది. వైఎస్ గారి కల నెరవేరింది. మొత్తానికి అమరావతిని పడగొట్టేశారు. రైతులను రెచ్చగొట్టడం, పంటలు తగలబెట్టడం, దొంగ ఉత్తరాలు, ఇలా జగనన్న చరిత్ర తెలుసుకున్న వరల్డ్ బ్యాంక్ ఇక సెలవందని పేర్కొన్నారు. బాబు గారి హయాంలో కళకళలాడిన అమరావతి మీ తుగ్లక్ చర్యలతో ఖాళీ అయిందని అని లోకేశ్ ట్విటర్ లో దుయ్యబట్టారు.

Related posts