టీడీపీ నేత నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని.. విష జ్వరాలతో ప్రజలు చనిపోయినా పర్వాలేదా అని లోకేష్ విమర్శించారు. దోమల నివారణకు ప్రజాధనం వృధా చేయబోమని వైసీపీ నేతలు సెలవిచ్చారని ట్వీట్టర్లో నారా లోకేష్ పేర్కొన్నారు.
రూపాయి జీతం మాత్రమే తీసుకుంటున్నానని చెప్పుకుంటున్న సీఎం జగన్ ఇంటి సోకులకు.. 5 నెలల్లో రూ.16 కోట్ల ప్రజాధనం ఎలా ఖర్చు చేశారో చెప్పగలరా? అని లోకేష్ ప్రశ్నించారు. దీనిపై సామజిక మాధ్యమాలలో వార్తలు హాల్ చల్ చేస్తున్న విషయం తెలిసిందే.
అమరావతికి మూడు వేల కోట్ల బ్యాంకు గ్యారెంటీ : బొత్స