లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నివాసంలో విషాదం చోటుచేసుకుంది. ఓం బిర్లా తండ్రి శ్రీకృష్ణ బిర్లా (92) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న తుదిశ్వాస విడిచారు. కోవిడ్ నిబంధనల నడుమ స్వస్థలం రాజస్తాన్లోని కిషోరాపూర్ ముక్తిధామంలో బుధవారం శ్రీకృష్ణ బిర్లా అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
పితృవియోగంతో విషాదంలో మునిగిపోయిన ఓం బిర్లా కుటుంబానికి బీజేపీ నాయకులు ప్రగాఢ సానుభూతి తెలిపారు.బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్, లోక్సభ ఎంపీ సుప్రియా సూలే తదితరులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
కల్వకుంట్ల జగన్ మోదీ రెడ్డి: లోకేష్