దేశ రాజధాని ఢిల్లీలో ఈసారి కూడా బీజేపీ మొత్తం స్థానాల్లో దూసుకెళ్తోంది. మొత్తం ఏడు స్థానాల్లోనూ బీజేపీ అభ్యర్థులే ముందంజలో ఉన్నారు. గత ఎన్నికల్లో ఢిల్లీలో మొత్తం 7 లోక్సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈస్ట్ ఢిల్లీలో బీజేపీ అభ్యర్థి, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఆధిక్యంలో ఉన్నారు. ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అరవీందర్ సింగ్ లవ్లీపై గంభీర్ 54,516 ఓట్లతో ముందంజలో ఉన్నారు.
ఇప్పటికే గంభీర్కు 1,36,914 ఓట్లు రాగా, లవ్లీకి 67,761 ఓట్లు వచ్చాయి. ఇక ఆమాద్మీ పార్టీ అభ్యర్థి అతిషి 46,453 ఓట్లతో మూడో స్థానంలో ఉన్నారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు, ఈశాన్య ఢిల్లీ అభ్యర్థి మనోజ్ తివారీ అందరికంటే అత్యధిక ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం 2,24,602 ఓట్లతో తివారీ ముందంజలో ఉండగా, కాంగ్రెస్ అభ్యర్థి, ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ 1,26,184 ఓట్లతో వెనుకబడ్డారు.
ఇచ్చిన వాగ్ధానాలకు బడ్జెట్కు పొంతన లేదు: టీడీపీ నేత అనురాధ