దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో ఐదో విడుత లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం నుంచే ప్రజలు ఓటేసేందుకు భారీగా పోలింగ్ బూత్ల వద్ద బారులు తీరారు. కేంద్ర హోంమంత్రి, లక్నో బీజేపీ అభ్యర్థి రాజ్నాథ్ సింగ్ లక్నోలోని స్కాలర్స్ హోమ్ స్కూల్లోని పోలింగ్ బూత్ 333లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథాడ్, ఆయన భార్య గాయత్రి రాథోడ్ రాజస్థాన్లోని జైపూర్లో ఓటు వేశారు. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి లక్నోలోని సిటీ మాంటెస్సరీ కాలేజీలో తమ ఓటు
హక్కును వినియోగించుకున్నారు.