లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ఆంధ్ర-కర్ణాటక సరిహద్దుల్లో వైసీపీ ఎమ్మెల్యే బొర్రా మధుసూదన్ యాదవ్ రెచ్చిపోయారు. తమను అడ్డుకున్న పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. లాక్డౌన్ నిబంధనను ఉల్లంఘిస్తూ బెంగుళూరు నుంచి 39మంది బంధువులతో ఐదు ఇన్నోవాలలో ఆంధ్రా బార్డర్కి వచ్చారు. చీకలబైలు చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు ఆయనను అడ్డుకున్నారు.
లాక్ డౌన్ ఉన్న కారణంగా కర్ణాటక నుంచి వచ్చే వారిని అనుమతించేది లేదని పోలీసులు ఎమ్మెల్యేకు చెప్పారు. దీంతో ఎమ్మెల్యే మధుసూదన్.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయినా పోలీసులు అంగీకరించకపోవడంతో వారిపై దౌర్జన్యం చేసి తన వాహనము తీసుకుని తిరుపతి వైపు వచ్చారు. ఆయన బంధువులు మాత్రం చెక్ పోస్ట్ దగ్గరనే ఆగిపోయారు.