telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

వర్క్ ఫ్రం హోం కోసం.. ఎయిర్​టెల్​ కీలక నిర్ణయం!

Airtel

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న కారణంగా పలు వ్యాపార సంస్థ ఉద్యోగులు ఇళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ టెలికామ్ సంస్థ ఎయిర్టెల్ కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాపార సంస్థ ఉద్యోగులు తమ ఇళ్ల నుంచి సమర్థవంతంగా, సురక్షితంగా పని చేసుకునేలా వర్క్ ఫ్రం హోం సొల్యూషన్స్ ను ప్రారంభించినట్లు తెలిపింది.

తమ కస్టమర్లు వ్యాపార కార్యకలాపాలను కొనసాగించేందుకు వీలుగా.. వైర్లెస్, డిజిటల్ సాధానాలు, అత్యుత్తమ కనెక్టివిటీ వంటి సదుపాయాలను ఈ పద్దతి ద్వారా కల్పిస్తున్నట్లు ఎయిర్టెల్ వివరించింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో కొత్త తరహా పని విధానాలతో వ్యాపార సంస్థలు ముందుకు సాగుతున్నాయి.

ఉద్యోగులు ఎక్కువగా ఇంటి నుంచి పనులు చేయడం సర్వసాధారణమైపోయిందని ఎయిర్టెల్ సంస్థ డైరెక్టర్, సీఈఓ అజయ్ చిత్కార తెలిపారు. వారికీ 4జీ నెట్వర్క్ ప్లాటినమ్ కార్పొరేట్ పోస్ట్పెయిడ్ కస్టమర్లకు.. ప్రాధాన్యతతో కూడిన 4జీ నెట్వర్క్ సేవలను అందించనున్నట్లు సంస్థ తెలిపింది. అత్యుత్తమ ఇండోర్ కవరేజీని అందించడానికి వాయిస్ఓవర్ వైఫై(వీఓవైఫై) సదుపాయాన్ని కల్పించనున్నట్లు తెలిపింది.

Related posts