telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

లాక్‌డౌన్ తర్వాత నేడు విజయవాడకు స్పెషల్ రైలు!

special train between vijayawada to gudur

లాక్‌డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ఈరోజు విజయవాడకు తొలి ప్రత్యేక రైలు రానుంది. న్యూఢిల్లీ- చెన్నై స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలు మధ్యాహ్నం 2:30 గంటలకు విజయవాడ చేరుకోనుంది. ఢిల్లీ నుంచి విజయవాడకు 300 ప్రయాణికులు రానున్నారు. అలాగే విజయవాడ నుంచి చెన్నైకి 300 ప్రయాణికులు వెళ్లనున్నారు.

చెన్నై వెళ్లే ప్రయాణికులు గంట ముందుగానే రైల్వే స్టేషన్ చేరుకోవాలని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ఢిల్లీ నుంచి వచ్చే మూడు వందల మంది ప్రయాణికులను ప్రత్యేక బస్సులు ద్వారా క్వారంటైన్‌కు తరలించేందుకు ఏర్పాటు చేశారు.

Related posts