కోవిడ్పై సమీక్షా సమావేశంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో కర్ఫ్యూ వేళల సడలింపులు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు సిఎం జగన్. ఏపీ ప్రభుత్వం నిర్ణయం ప్రకారం.. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ సడలింపు వర్తించనున్నాయి. జూన్ 20 తర్వాత నుంచి అమలు ఈ సడలింపు వర్తించనున్నాయి. సర్కార్ నిబంధనల ప్రకారం.. సా.5 గంటలు కల్లా దుకాణాలు మూసివేయాలి. సా. 6 గంటల నుంచి కర్ఫ్యూ కచ్చితంగా అమలు చేయనుంది సర్కార్. తూ.గో. జిల్లాలో మాత్రం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ సడలింపులు ఇస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్నందున ఈ జిల్లాలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు సడలింపులు ఇవ్వనుంది. ప్రభుత్వ కార్యాలయాలకు రెగ్యులర్ టైమింగ్స్ ఉండనుండగా.. ఉద్యోగులు అందరూ కార్యాలయాలకు వచ్చేలా సర్కార్ చర్యలు తీసుకుంటోంది. కాగా ఏపీలో రోజు రోజుకు కరోనా కేసులు తగ్గు ముఖ్యం పడుతున్న సంగతి తెలిసిందే.
previous post