లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో రంజాన్ మాసం రావడంతో పేద ముస్లింలను ఆడుకోవాలని మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆయన లేఖ రాశారు. ఈ నెల 25 నుంచే రంజాన్ మాసం ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.
లాక్డౌన్ను పొడిగించిన నేపథ్యంలో 9 రోజులపాటు లాక్డౌన్లోనే ఉపవాస దీక్షలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. లాక్డౌన్ నేపథ్యంలో పేద ముస్లింలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కాబట్టి వారికి నిత్యావసర సరుకులు, నూతన వస్త్రాలు పంపిణీ చేసి ఆదుకోవాలని అక్బరుద్దీన్ ఆ లేఖలో పేర్కొన్నారు.
టీడీపీ నేతలపై కక్ష సాధించడమే వైసీపీ అజెండా: చంద్రబాబు