telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణలో రేపటి నుంచి లాక్‌డౌన్.. సిఎం కెసిఆర్ సంచలన నిర్ణయం

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు క్యాబినెట్ సమావేశం అయింది. రోజు రోజుకూ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో లాక్ డౌన్ విధింపు పై క్యాబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో రేపటి నుంచి లాక్ డౌన్ విధిస్తున్నట్లు కెసిఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి 10 రోజుల పాటు లాక్డౌన్ ఉండనుంది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సిఎం కెసిఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు లాక్ డౌన్ నిర్ణయం తీసుకోగా.. మారికాసేపట్లో లాక్ డౌన్ మార్గదర్శకాలపై పూర్తి క్లారిటీ రానుంది. ఇక టీకా కొనుగోలు కొరకు గ్లోబల్ టెండర్లను పిలవాలని కెబినెట్ నిర్ణయించింది. 

Related posts