telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ మరోసారి పొడగింపు

Red zone corona

లాక్ డౌన్ పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ మరో 2 వారాల పాటు పొడిగిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో లాక్ డౌన్ మే 17 వరకు కొనసాగనుంది. రెండో దఫా లాక్‌డౌన్‌ గడువు మే 3తో ముగియనుంది. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ.. లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త మార్గదర్శకాలను కేంద్రం జారీ చేసింది.

లాక్ డౌన్ పొడిగింపు నేపథ్యంలో రెడ్ జోన్ లో కట్టుదిట్టమైన చర్యలు అలాగే కొనసాగనున్నాయి. ఆరంజ్, గ్రీన్ జోన్లలో కొన్ని మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉంది. దేశ వ్యాప్తంగా విమానాలు, రైళ్లు, మెట్రో సర్వీసులు, పాఠశాలలు, కళాశాలలతో పాటు శిక్షణ, కోచింగ్‌ సంస్థలపై నిషేధం విధించారు

Related posts