ఏపీలో కరోనా విలయతాండవం చేయడంతో రోజురోజుకూ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడి చేసేందుకు మాస్క్, సోషల్ డిస్టెన్స్, శానిటైజ్ వంటివి వాడుతున్నా కట్టడి కావడం లేదు. దీంతో అధికారులు లాక్ డౌన్ విధించారు. ఇప్పటికే తిరుపతిలో లాక్ డౌన్ కొనసాగుతున్నది. గతంలో విధించిన 10 రోజుల లాక్ డౌన్ నేటితో పూర్తయింది. అయితే, లాక్ డౌన్ ను మరో పదిరోజులు పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
ఆగష్టు 14 వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తూ జిల్లా అధికారులు, తిరుపతి నగరపాలక సంస్థ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే లాక్ డౌన్ కారణంగా నగరంలో వ్యాపార లావాదేవీలు చాలా వరకు మూతపడ్డాయి. లాక్ డౌన్ కారణంగా అటు తిరుమల వెళ్లే భక్తుల సంఖ్య చాలా తగ్గిపోయింది. జారీ చేసిన టిక్కెట్ల కంటే తక్కువ మంది భక్తులు తిరుమలకు వస్తున్నారని టీటీడీ ప్రకటించింది.