telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

బైక్ ఆపిన కానిస్టేబుల్‌ పై తండ్రీకొడుకుల దాడి!

New couples attack SR Nagar

ఏపీలో లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బైక్‌పై రోడ్డుమీదికొచ్చిన తండ్రీ కొడుకులను ఓ కానిస్టేబుల్‌ అడ్డుకున్నారు. వెంటనే బైక్‌ ఆపిన కానిస్టేబుల్‌ను వారిద్దరూ కలిసి చితకబాదారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో ఘటన చోటుచేసుకొంది. పోలీసుల కథనం ప్రకారం.. టెక్కలి మండలంలోని పరశురాంపురం గ్రామానికి చెందిన తండ్రీకొడుకులైన వాకాడ శ్రీనివాసరావు, వినీత్‌లు బైక్‌పై వస్తుండగా, కోటబొమ్మాళి రైతు బజార్ వద్ద విధుల్లో ఉన్న కానిస్టేబుల్ భైరి జీవరత్నం వీరిని ఆపాడు.

దీంతో తమను ఎందుకు ఆపావంటూ కానిస్టేబుల్‌తో తండ్రీకొడుకులు గొడవకు దిగారు. ఈ క్రమంలో గొడవ మరింత పెద్దదైంది. ఆగ్రహం పట్టలేని శ్రీనివాసరావు, వినీత్‌లు కానిస్టేబుల్ చేతిలో ఉన్న లాఠీ లాక్కుని అతడిని చితకబాదారు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. వినీత్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts