కరోనా వ్యాప్తిని అరికట్టడానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న సంగతి తెలిసిందే. పోలీసులు నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులపై కొందరు రాళ్లు రువ్వుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. లాక్డౌన్ నేపథ్యంలో చట్టాన్ని అమలు చేసేందుకు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ దుకాణాలు తెరవనీయకుండా అడ్డుకుంటున్నారు.
లాక్ డౌన్ నేపథ్యంలో అసోంలోని భావ్లాగురి బోది బజార్లో లాక్డౌన్ను ఉల్లంఘిస్తూ కొందరు వ్యాపారులు తమ సొంత లాభాల కోసం దుకాణాలు తెరిచారు. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి మూసేయాలని అన్నారు. దీంతో వ్యాపారులంతా కలిసి పోలీసులపై రాళ్లు రువ్వుతూ దాడి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నలుగురిని అరెస్టు చేశామని ఎస్పీ ఆర్ఎస్ మిల్లీ తెలిపారు. అసోంలోనే కాకుండా దేశంలోని పలు ప్రాంతాల్లో పోలీసులపై దాడి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
కాపుల అన్యాయాలపై పవన్ ప్రశ్నించలేదు: ఎమ్మెల్యే జక్కంపూడి