నేటితో తొలివిడుత స్థానిక ఎన్నికలకు ప్రచారం ముగిసింది. దీని తో ఆప్రాంతాలో టీవీలు, రేడియోల్లోనూ ప్రచారం నిషేదమని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. అంతేకాక తొలి విడత పోలింగ్ జరిగే ప్రాంతాల్లో స్థానికేతరులు ఉండరాదని, ప్రచారం కోసం వచ్చిన స్థానికేతరులు ఆయా ప్రాంతాలను వదిలివెళ్లాలని తెలిపింది.
తొలివిడతలో 2,097 ఎంపీటీసీ, 195 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికల నిర్వహణ జరగనుంది. 6వ తేదీ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహణ. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహణ.