telugu navyamedia
Uncategorized

ఏపీలో మరోసారి స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా!

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు మరోసారి వాయిదా పడ్డాయి. ప్రస్తుతం లాక్ డౌన్ కొనసాగుతుండటంతో స్థానిక సంస్థల ఎన్నికలు మరికొంత కాలం వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియ నిలిపివేయాలని నిర్ణయించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల నిలిపివేతను కొనసాగిస్తామని ఆ ప్రకటనలో పేర్కొంది.

రాష్ట్రంలో పరిస్థితులు అనుకూలించాక ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఎస్ఈసీ స్పష్టం చేసింది. కాగా, కరోనా’ దృష్ట్యా ఏపీలో స్థానిక సంస్థలను గత మార్చి 15 నుంచి తొలుత 6 వారాలు వాయిదా వేశారు. ఏప్రిల్‌ 31తో ఎన్నికల వాయిదా గడువు ముగిసింది. దీంతో ఎస్‌ఈసీ కనగరాజ్ మరోసారి నోటిఫికేషన్ విడుదల చేశారు.

Related posts