telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ముంబైలో ల్యాండ్‌ అయిన ‘లైగర్’‌ !

విజయ్ దేవరకొండ… పెళ్లి చూపులు సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన విజయ్ తనదైన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఆ తరువాత అర్జున్ రెడ్డితో మాస్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఆ సినిమా తరువాత వెంటనే గీతా గోవిందం అంటూ అమాయకుడిగా కూడా అందరినీ మెప్పించారు. ప్రస్తుతం విజయ్ మాస్ దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్ సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు మొదట ఫైటర్ పేరు ప్రచారణలో ఉన్నా సినిమాకు మాత్రం లైగర్ అనే పేరును ఖరారు చేశారు. ఇందులో విజయ్ బాక్సర్‌గా దర్శనమివ్వనున్నారు. ఈ సినిమాను ప్రస్తుతం ముంబైలో చిత్రీకరిస్తున్నారు. అయితే తాజాగా విజయ్ దేవరకొండ హైదరాబాద్‌లో తారస పడ్డారు. కంఫర్టబుల్ దుస్తులు వేసుకొని కనిపించారు. తనదైన స్టైల్‌తో మళ్ళీ అందరినీ ఆకట్టుకున్నారు. విజయ్ తిరిగి ముంబైకు బయలుదెరారు. విమానంలో విజయ్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే లైగర్ సినిమాను హిందీలో ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్, చార్మీ, పూరీలతో కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం రౌడీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Related posts