telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనలో హైకోర్టు కీలక ఆదేశాలు

ap high court

విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో స్టైరిన్‌ గ్యాస్‌ లీకేజీ దుర్ఘటనలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తమ అనుమతి లేకుండా కంపెనీ డైరెక్టర్లు దేశం విడిచి వెళ్లొద్దని పేర్కొంది. లాక్‌డౌన్‌ తర్వాత కంపెనీ కార్యకలాపాలు తిరిగి ప్రారంభించేందుకు.. ఎవరి పర్మిషన్‌ తీసుకున్నారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని ధర్మాసనం ప్రశ్నించింది. ఎల్జీ పాలిమర్స్‌ పరిసరాలను సీజ్‌ చేయాలని సూచించింది.

కంపెనీ డైరెక్టర్లతో సహా ఏ ఒక్కరినీ లోనికి అనుమతించకూడదని తెలిపింది. ఏం పరిశీలించారో రికార్డు బుక్కుల్లో పేర్కొనాలని తెలిపింది. ప్రమాదం జరిగిన తర్వాత స్టైరిన్‌ గ్యాస్‌ను తరలించేందుకు.. ఎవరు అనుమతి ఇచ్చారో చెప్పాలని ఆదేశించింది.విద్యాసంస్థలు, హాస్పిటల్స్‌, జనావాసాలు ఉన్నచోట ప్రమాదకరమైన గ్యాస్‌ను ఎలా స్టోర్‌ చేశారని ప్రశ్నించింది. గ్యాస్‌ లీకేజీ ఘటనను మే 7న సుమోటోగా స్వీకరించిన హైకోర్టు.. యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ప్రశ్నించింది.

Related posts