telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

అర్ధరాత్రి మరోసారి లీకైన గ్యాస్.. భయంతో జనం పరుగులు!

vishakha gas leak

విశాఖ వాసులు మరోసారి ఉలిక్కిపడ్డారు. గత అర్ధ రాత్రి కూడా మళ్లీ గ్యాస్ లీక్ కావడంతో జనం భయంతో పరుగులు తీశారు. ఎన్‌ఏడీ, బాజీ జంక్షన్, గోపాలపట్నం, సుజాతనగర్, పెందుర్తి, అడివివరం, పినగాడి, సింహాచలం, ప్రహ్లాదపురం, వేపగుంట ప్రాంతాలకు చెందిన వేలాదిమంది ప్రాణాలు అరచేత పట్టుకుని అర్ధరాత్రి వేళ రోడ్లపైకి వచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.

మరోవైపు, పూణెకు చెందిన ఎన్విరాన్‌మెంట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన 9 మంది శాస్త్రవేత్తలు గ్యాస్ లీక్ అయిన ఎల్‌జీ పాలిమర్స్‌లోకి వెళ్లి పరిశోధన ప్రారంభించారు. న్యూట్రలైజర్‌ను ఉపయోగించి విషవాయువు బయటకు రాకుండా గడ్డకట్టించే ప్రయత్నం చేస్తున్నారు.

Related posts