ఏపీ శాసనమండలి రద్దు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ ఉదయం సమావేశమైన జగన్ క్యాబినెట్ మండలి రద్దు నిర్ణయానికి ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే. ఆపై నేడు అసెంబ్లీలో మండలి రద్దు బిల్లును చర్చకు పెట్టి, ఆ వెంటనే ఆమోదింపజేసుకుని, కేంద్రానికి పంపించాలని ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.
మరికాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా, తొలుత కొన్ని బిల్లులకు ఆమోదం పొంది, ఆపై మండలి రద్దు బిల్లును చర్చకు పెడతారని సమాచారం. మండలి రద్దు బిల్లుకు ఆమోదం లభించిన తరువాత అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడే అవకాశముంది.