పశ్చిమ బెంగాల్ నటుడు స్వరూప్ దత్తా అనారోగ్యం ఈరోజు తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. స్వరూప్ దత్తాకు భార్య, కొడుకు ఉన్నారు. ఆయన కొడుకు షరన్ దత్తా కూడా బెంగాలీలో మంచి నటుడే. కొన్నాళ్లుగా అపస్మారక స్థితిలో ఉన్న ఆయన ఇప్పుడు మరణించారని కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఈయన మరణంతో ఇండస్ట్రీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. స్వరూప్ దత్తా అంటే తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ బెంగాలి సినిమాలో మాత్రం ఆయన అద్భుతమైన నటుడు. అక్కడ చాలా సినిమాల్లో నటించాడు కూడా. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఈయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు స్వరూప్ దత్తా. 1968లో తపన సిన్హా దర్శకత్వంలో వచ్చిన “అపంజన్” సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు స్వరూప్. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించారు. 60, 70వ దశకాల్లో ఎన్నో సినిమాలు చేసిన ఈయన మృతి ఇండస్ట్రీకి తీరని లోటు అంటున్నారు పలువురు బెంగాలి ప్రముఖ నటీనటులు.
previous post
ఎంత ట్రై చేస్తున్నా అతను మాత్రం పడడం లేదు… హీరోయిన్ కామెంట్స్