స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం `అల వైకుంఠపురములో..`. ఈ సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్గా నిలిచింది. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. అయితే ఈ సినిమా కథ నాదంటూ కృష్ణ అనే దర్శకుడు షాకింగ్ వ్యాఖ్యలు చేసారు. 2005లో తాను త్రివిక్రమ్ను కలిసానని అదే సమయంలో అల వైకుంఠపురములో కథ చెప్పానని అంటున్నారు. అంతేకాదు, 2013లో ఈ కథని ఆయన ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేసుకున్నానని ఆరోపిస్తున్నారు. తన కథను వాడుకుంది కాకుండా కనీసం క్రెడిట్స్లో తన పేరును ఎక్కడా ప్రస్తావించలేదని కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేసారు. త్వరలో త్రివిక్రమ్కు నోటీసులు పంపుతానని హెచ్చరించారు. ఈ సినిమా కథను త్రివిక్రమ్ కాపీ కొట్టాడని గతంలో సినీ క్రిటిక్ కత్తి మహేష్ కూడా కీలక వ్యాఖ్యలు చేసారు. మరి తాజాగా దర్శకుడు కృష్ణ చేస్తున్న ఆరోపణలపై త్రివిక్రమ్ ఎలా స్పందిస్తారో చూడాలి.
previous post
next post
కొత్త వ్యవసాయ చట్టాల పై హర్యానా సీఎం కీలక వ్యాఖ్యలు…