వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ కాబోతున్నారని ఆపార్టీ నాయకురాలు లక్ష్మీపార్వతి జోస్యం చెప్పారు. జగన్ సీఎం కావడాన్ని తట్టుకోలేక చంద్రబాబు కుమిలిపోతారని అన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ ఓటమి ఖాయమని చెప్పారు. జగన్ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని తెలిపారు. అన్ని ఛానళ్ల సర్వేలు జగన్ కే అనుకూలంగా ఉన్నాయని చెప్పారు.
చంద్రబాబు రాజకీయ జీవితం సమాప్తమయిందని చెప్పారు. ఇక చంద్రబాబు తట్టాబుట్టా సర్దుకోవాల్సిందేనని అన్నారు. ఈ నెల 19న విడుదల కానున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని అడ్డుకోవాలని చంద్రబాబు చూస్తున్నారని అన్నారు. సినిమాను సినిమాలానే చూడాలని హితవు పలికారు. అలా కాకుండా తమను ఇబ్బందులకు గురి చేస్తే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు.