ఎన్టీఆర్ వాస్తవ జీవిత చరిత్రను తీసే ధైర్యం బాలకృష్ణకు లేదని వైసీపీ నాయకురాలు లక్షీపార్వతి అన్నారు. వ్యక్తిగతంగా బాలయ్య చాలా మంచి వ్యక్తని, ఏపీ సీఎం చంద్రబాబుకు భయపడుతున్నారని ఆమె అన్నారు. ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని ఆమె దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడతూ రెండు భాగాలుగా సినిమా తీసినా, అది ఎన్టీఆర్ సగం జీవిత చరిత్రే అవుతుందని ఎద్దేవా చేశారు.
ఎన్టీఆర్ కష్ట సుఖాలను, అన్యాయాలను కూడా తెరపై చూపించడాన్నే బయోపిక్ అంటారన్నారు. కథానాయకుడు సినిమా చూసేందుకు నన్నెవరూ ఆహ్వానించలేదని తెలిపారు. రామ్ గోపాల్ వర్మ తీసే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంతోనే ఎన్టీఆర్ జీవితం పూర్తవుతుందని చెప్పారు. బయోపిక్లో వర్మ విడుదల చేసిన ఎందుకు ఎందుకు అన్న పాట తనకు బాధను కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
డబుల్ బెడ్రూమ్ ఇళ్లు అందరికీ రావు…