వైసీపీ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావుపై ఏపీ తెలుగు అకాడమీ చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు అకాడమీ చైర్ పర్సన్గా నియమితులైన తర్వాత ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ఆయనేమీ తక్కువోడు కాదని అన్నారు. తనపై అసత్యాలు ప్రచారం చేయడంలో ఆయన పాత్ర కూడా ఉందని అన్నారు. ఎన్టీఆర్ తనకు పదవి ఇస్తానన్నా రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.
ఇక, చంద్రబాబును నమ్మే పరిస్థితి ఆ పార్టీ నేతల్లో లేదని లక్ష్మీపార్వతి తేల్చి చెప్పారు. కుక్కమూతి పిందెకు ఏం తెలుసని పెద్ద నేతను చేశారని లోకేశ్ను ఉద్దేశించి విమర్శించారు. తెలుగుదేశం పార్టీకి చివరి రోజులు నడుస్తున్నాయని, నేడు ఆ పార్టీ దౌర్భాగ్య స్థితిలో ఉందని అన్నారు. తనను పార్టీ నుంచి వెళ్లగొట్టేందుకు అనుకూల మీడియాలో తనపై వ్యతిరేక వార్తలు రాయించారని లక్ష్మీపార్వతి ఆరోపించారు.