telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సమ్మె ఆర్టీసి కార్మికులది కాదు..ఇది సకల జనుల సమ్మె: లక్ష్మణ్

bjp leader lakshman on trs power agreements

ప్రస్తుతం జరుగుతున్న సమ్మె కేవలం ఆర్టీసి కార్మికులది కాదని.. ఇది సకల జనుల సమ్మె అని బీజేపీ నేత లక్ష్మణ్ అన్నారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల జేఏసీ ఇచ్చిన బంద్ కు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కార్మికులతో కలిసి ప్రతిపక్ష పార్టీల నేతలు బంద్ లో పాల్గొంటున్నారు. హైదరాబాద్ లోని అబిడ్స్ లో ఆందోళనలో పాల్గొన్న బీజేపీ నేతలు , రామచందర్ రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ… పదవులు శాశ్వతం కాదన్న విషయాన్ని టీఆర్ఎస్ నేతలు గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు.

తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వారు ద్రోహులంటూ గతంలో టీఆర్ఎస్ నేతలు అన్నారని లక్ష్మణ్ గుర్తు చేశారు. ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల ఉద్యమంలో పాల్గొనని రాష్ట్ర మంత్రులు ఈటల రాజేందర్, హరీశ్ రావులు కూడా ద్రోహులేనని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అప్రజాస్వామిక చర్యలను తాను కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తున్నానని లక్ష్మణ్ తెలిపారు. కోర్టు మొట్టికాయలు వేసినప్పటికీ రాష్ట్ర సర్కారు స్పందించట్లేదని తెలిపారు.

Related posts