telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పాపం లావణ్య త్రిపాఠి… హాస్పిటల్ కి కూడా వెళ్ళలేదంట..

Lavanya-Tripati

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా సినీ తారలందరినీ ఇంట్లోనే కూర్చోబెట్టింది. షూటింగ్స్ అన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు సినీ నటులంతా హోమ్ క్వారంటైన్ లోనే ఉండిపోయారు. ఈ పరిస్థితుల్లో తన హోమ్ క్వారంటైన్ గురించి స్పందిస్తూ ప్రముఖ మీడియాతో ముచ్చటించింది లావణ్య త్రిపాఠి. ఈ లాక్‌డౌన్‌ సమయంలో తన చేతి వేళ్లకు గాయమైందని చెప్పింది లావణ్య. బలంగా, చాలా వేగంగా కిటికీ డోర్‌ వేయడంతో ఆ డోర్ మధ్యలోనే తన రెండు వేళ్లు పడి గట్టిగా దెబ్బ తగిలిందని ఆమె తెలిపింది. ఎనిమిది రోజులుగా నొప్పి ఉన్నప్పటికీ లాక్‌డౌన్‌ కారణంగా హాస్పటల్‌కి కూడా వెళ్లలేదని చెప్పింది. ఇలాంటి సమయంలో కరోనా సోకిన వారికి చికిత్స చేయడం ముఖ్యమని చెప్పుకొచ్చింది. సాధారణంగానే తనకు బయటకు వెళ్లే అలవాటు తక్కువ అని, ఇంట్లో ఉండడం, వంట చేయడం లాంటివే తనకు కాబట్టి ప్రస్తుతం అదే చేస్తున్నానని, కాకపోతే ఇంటికి హెల్పర్స్‌ రాకపోవడం వల్ల కొంచెం కష్టంగా ఉందని ఆమె చెప్పింది. ఇకపోతే దేశంలో ఇలాంటి పరిస్థితులు వస్తాయని అస్సలు ఊహించలేదని, ఎమర్జన్సీ అయితే తప్ప బయటకు వెళ్లకూడదని ఈ సందర్భంగా లావణ్య త్రిపాఠి పేర్కొంది. ఇదిలాఉంటే ఈ కరోనా కల్లోల సమయంలో సినీ కార్మికులకు అండగా నిలుస్తూ చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పడిన సీసీసీ ఛారిటీకి లావణ్య 1 లక్ష రూపాయల చెక్ అందించింది.

Related posts