telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సరిలేరు నీకెవ్వరు : సెకండాఫ్‌లో హిలేరియస్ గా ఎలుక ఎపిసోడ్‌

Sarileru-NIkevvaru

అనీల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మ‌హేష్ బాబు హీరోగా రూపొందుతున్న చిత్రం “స‌రిలేరు నీకెవ్వ‌రు”. 90లలో లేడీ సూపర్‌స్టార్‌గా అద్భుతమైన స్టార్‌డమ్‌ సంపాదించిన విజ‌య‌శాంతి మ‌ళ్ళీ 13 ఏళ్ళ త‌ర్వాత “స‌రిలేరు” నీకెవ్వ‌రు అనే చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తుండ‌డంతో ఈ సినిమాపై ఆమె అభిమానుల‌లో చాలా ఆస‌క్తి నెల‌కొంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంలో మ‌హేష్ మేజర్‌ అజయ్‌ కృష్ణ పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఆయ‌న స‌ర‌స‌న‌ ర‌ష్మిక మందన్న క‌థానాయిక‌గా న‌టిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. చిత్రాన్ని దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, సంక్రాంతి కానుక‌గా జ‌నవ‌రి 11న విడుద‌ల కానుంది. ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను కూడా పూర్తి చేసుకుని `యు/ఎ` స‌ర్టిఫికేట్‌ను పొందింది. అనిల్ రావిపూడి సినిమా అంటే ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్ర‌ధానంగా ఉంటుంది. తొలి ప్రథమార్థంలో ట్రెయిన్ ఎపిసోడ్ ఉంటుంది. ఈ ఎపిసోడ్ చాలా హిలేరియస్‌గా వచ్చిందట. ఇక అదే రేంజ్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ కావాలనే ఆలోచ‌న‌తో సెకండాఫ్‌లో ఎలుక ఎపిసోడ్‌ను ప్లాన్ చేసి చిత్రీక‌రించార‌ట‌. దీంతో పాటు వెన్నెల‌కిషోర్‌, సుబ్బ‌రాజు కామెడీ ట్రాక్ కూడా ఉంటుంద‌ట‌. సినిమాలో ఎమోష‌న్ యాంగిల్‌నంతా విజ‌య‌శాంతి క్యారీ చేశార‌ట‌. సినిమా విడుదల గురించి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సూపర్ స్టార్ అభిమానులు.

Related posts