telugu navyamedia
సినిమా వార్తలు

ఈ ఇంట్లో మెగా హీరోకు “ప్రతిరోజూ పండగే”

PP

మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా దర్శకుడు మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “ప్రతీరోజూ పండగే”. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ సరసన హీరోయిన్ గా రాశిఖన్నా నటిస్తోంది. అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమా కోసం హైదరాబాద్ శివార్లలో నిర్మించిన ఇంటి సెట్ ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. సిమెంట్ వాడకుండా అతి కొద్ది రోజుల్లో ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ నిర్మించిన ఆ ఇంటిని చూసేందుకు సినీ పరిశ్రమకు చెందిన వారు కూడా వస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో సాయిధరమ్‌కు తాతగా నటిస్తున్న సత్యరాజ్‌ది గోదావరి ప్రాంతం. ఆయన నివసించే ఇల్లు కథకు తగినట్టు ఉండాలి. పాత, కొత్తల మేలికలయికగా ఉండాలి. అలాంటి ఇంటి కోసం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చిత్రయూనిట్ గాలించింది. ఫలితం లేకపోవడంతో హైదరాబాద్ శివార్లలోని ఒక ఎకరం ప్రాంతంలో ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ ఇంటి సెట్ వేశారు. సిమెంటు ఎక్కడా వాడకుండా కేవలం 17 రోజుల్లోనే 1.25 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన ఆ ఇల్లు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. త్వరలోనే ఈ ఇంట్లో షూటింగ్ ప్రారంభం కాబోతోంది.

Related posts