తెలుగులో “భరత్ అనే నేను” చిత్రంతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ. ఈ భామ హిందీలో “లస్ట్ స్టోరీస్” అనే వెబ్ సిరీస్ తో తనలోని హాట్ నెస్ బయటపెట్టి యూత్ లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఆ తరువాత రామ్ చరణ్ సరసన “వినయ విధేయ రామ” అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చినా… ఆ సినిమా పెద్దగా హిట్ కాలేదు. ఇక ఇటీవల బాలీవుడ్ లో విడుదలైన “అర్జున్ రెడ్డి ” రీమేక్ “కబీర్సింగ్” చిత్రంతో కెరీర్లో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది కియారా అద్వానీ. ప్రీతి పాత్రలో సహజనటనతో ఆకట్టుకున్నది. ఈ సక్సెస్తో బాలీవుడ్లో బిజీగా మారిపోయింది. ప్రస్తుతం కియారా “గుడ్న్యూస్”, “లక్ష్మీబాంబ్”, “షేర్షా”, “ఇందూకీ జవానీ” సినిమాలు చేస్తోంది. “ఇందూకీ జవానీ” చిత్ర ప్రమోషన్స్లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కియార తన కెరీర్ గురించి మాట్లాడింది. “హీరోయిన్గా నా కెరీర్ చాలా ఆసక్తికరంగా సాగింది. హిందీతోపాటు పలు భాషల్లో నటించాను. వెబ్సిరీస్ల్లోనూ నటించాను. ఇక్కడ అందం ఒకటే సరిపోదు. కేవలం అందం మీదే ఆధారపడిన హీరోయిన్లు కొద్దికాలమే ఉంటారు. అందంతోపాటు ప్రతిభ కూడా తోడైతే ఎక్కువకాలం ఇండస్ట్రీలో ఉంటారు” అని కియార చెప్పింది.
విద్యాబాలన్ ముద్దులతో మెసేజ్ చేసింది… హీరో షాకింగ్ కామెంట్స్