బుల్లితెర అతి పెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 జూలై 21 నుండి ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో నాగార్జున హోస్ట్గా రూపొందనున్న బిగ్ బాస్ కార్యక్రమం 15 మంది సెలబ్రిటీలతో వంద రోజుల పాటు జరగనుంది. అయితే ఈ షో ప్రారంభం కాకముందే వివాదాస్పదమైంది. ఈ కార్యక్రమంపై కొద్ది రోజులుగా అనేక ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. జర్నలిస్ట్ శ్వేతారెడ్డి, నటి గాయత్రి గుప్తా బిగ్ బాస్ నిర్వాహకులు తమతో అసభ్యంగా ప్రవర్తించారని పోలీసులకి ఫిర్యాదు చేశారు. కేతిరెడ్డి జగదీశ్వర్రెడ్డి కూడా ఈ కార్యక్రమాన్ని బ్యాన్ చేయాలని కోరారు. ఓయూ జేఏసీ కొద్ది సేపటి క్రితం నాగార్జున ఇంటిని చుట్టుముట్టారు. పరిస్థితి సీరియస్గా మారుతుండటంతో స్టార్ మా నిర్వాహకులు ఆదివారం ప్రారంభం కావాల్సిన బిగ్ బాస్ షోను వాయిదా వేసే యోచనలో ఉన్నారట. అలాగే బిగ్బాస్ 3 వ్యాఖ్యాతగా తప్పుకోవాలనే ఆలోచనలో నాగార్జున ఉన్నారని సమాచారం. ఆ దిశగా స్టార్ మా యాజమాన్యంతో సంప్రదింపులు చేస్తున్నారని తెలుస్తోంది.
previous post