కమల్హాసన్, శంకర్ కాంబినేషన్లో 23 ఏళ్ల భారీ గ్యాప్ తర్వాత రూపొందుతోన్న చిత్రం “భారతీయుడు-2”. వీరిద్దరి కాంబినేషన్లో 1996లో విడుదలై ఘన విజయం సాధించిన “భారతీయుడు” సినిమాకు ఇది సీక్వెల్. ఈ సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే మొదలయ్యింది. అయితే బడ్జెట్ కారణాలతో సినిమా ఆగింది. నిర్మాణ సంస్థ లైకా శంకర్కు బడ్జెట్ పరిమితులు విధించింది. ముందుగా నిర్మాతల షరతులకు ఒప్పుకోనంటూ దర్శకుడు శంకర్ బెట్టు చేసినప్పటికీ… చివరకు బడ్జెట్ పరిమితులకు తలొగ్గక తప్పలేదు. దీంతో ఆగిపోయిన సినిమా షూటింగ్ ఆగస్ట్లో ప్రారంభము కానుందని తెలుస్తోంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరో్యిన్గా నటిస్తుంది. అయితే సినిమా ఆగిపోయిందనే వార్తలు వచ్చినప్పుడే… కాజల్ కూడా ఈ సినిమాలోంచి తప్పుకుంటోంది అనే వార్తలు వచ్చాయి. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో మరో ఇద్దరు హీరోయిన్స్ను శంకర్ ఎంపిక చేసుకున్నారట. హీరోయిన్స్ ఐశ్వర్య రాజేశ్, ప్రియా భవాని కీలక పాత్రల్లో నటించబోతున్నారని తెలుస్తోంది.