దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో ఓ క్రేజీ మల్టీస్టారర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాను డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా గురించి సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్. కీరవాణి ఇటీవలే అప్డేట్ ఇచ్చారు. “ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన అప్డేట్ – అల్యూమినియం ఫ్యాక్టరీలో మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి” అని కీరవాణి ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు కీరవాణి కొన్ని కీలకమైన బాణీలు ఇచ్చారని, ప్రముఖ లిరిసిస్ట్ సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ రాస్తున్నట్టు తెలుస్తోంది. మార్చి 14న ఆర్ఆర్ఆర్ కు సంబంధించిన ప్రెస్ మీట్ ను రాజమౌళి నిర్వహిస్తున్నారు. ఈ ప్రెస్ మీట్ లో సినిమాకు సంబంధించిన కీలకమైన విషయాలను మీడియాతో పంచుకోబోతున్నారు.
ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ పూర్తి కాగానే టీమ్ మొత్తం బ్యూటిఫుల్ సిటీ కలకత్తాకు ప్రయాణం కానున్నట్లు తెలుస్తోంది. అక్కడ సుమారు 40 రోజుల పాటు ఆకర్షణీయమైన లొకేషన్లలో సినిమా చిత్రీకరణ జరుగుతుందని సమాచారం. ఈ షెడ్యూల్లో చరణ్, ఎన్టీఆర్ తో పాటు పలువురు కీలకపాత్రధారులకు సంబంధించిన షూటింగ్ జరగనుంది. తాజాగా ఈ సినిమాలో చరణ్, తారక్ ల పాత్ర గురించి ఓ వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ పోలీస్ అధికారి పాత్రలో రాముడి తరహాలో కనిపించబోతున్నాడట. ఎన్టీయార్ ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో నెగెటివ్ షేడ్ తో రావణుడి తరహాలో నటిస్తున్నాడట. ఇక ఈ సినిమాలో కథానాయికలుగా బాలీవుడ్ హీరోయిన్లు ఆలియా భట్, పరిణీతి చోప్రాలను తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి. దాదాపు రూ.300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం 2020లో విడుదలవుతుందని ముందుగానే ప్రకటించారు.
లవ్ ఫెయిల్యూర్ గురించి స్పందించిన నయనతార…