ప్రముఖ గాయని లతా మంగేష్కర్ శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది తలెత్తడంతో సోమవారం ఆమెని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. కొద్ది రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లతామంగేష్కర్ ఆరోగ్యం ఇప్పుడు మరింత మెరుగు పడిందని ఆమె అధికార ప్రతినిధి తెలిపారు. మీ ప్రార్ధనల వలన ఆమె చాలా స్పీడ్గా రికవర్ అవుతున్నారని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు లత వేగంగా కోలుకోవాలంటూ బాలీవుడ్ ప్రముఖులు షబానా అజ్మీ, హేమమాలిని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఆమె అభిమానులు కూడా ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
Statement from #LataMangeshkar‘s team: We are as happy as you are to inform you that with all your prayers and best wishes, Lata didi is doing much better. (file pic) pic.twitter.com/y7Infws0W5
— ANI (@ANI) 15 November 2019