పుల్వామా ఘటనకు ప్రతీకారంగా భారత వైమానిక దళం మెరుపుదాడులతో 300 మంది ఉగ్రవాదులను హతమార్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇక మరణించిన జవానులు కుటుంబాలకు సెలెబ్రిటీలు భారీ విరాళాలు ప్రకటిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోలు అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్ తదితరులు తమకు తోచినంత విరాళాలను వీర మరణం పొందిన జవానుల కుటుంబాల కోసం ప్రకటించారు. తాజాగా గాన కోకిల లతా మంగేష్కర్ మంచి మనసుతో జవానుల కోసం భారీ విరాళం ప్రకటించారు. వీరమరణం పొందిన జవానుల కుటుంబాలకు కోటి రూపాయల విరాళం ప్రకటించారు. తన తండ్రి దీనానాథ్ మంగేష్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈ విరాళాలను అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈంతో మీపై మరింత గౌరవం పెరిగిందంటూ నెటిజన్లు లతా మంగేష్కర్ ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
previous post
next post