telugu navyamedia
సినిమా వార్తలు

సుప్రీం కోర్టుకు “లక్ష్మీస్ ఎన్టీఆర్” నిర్మాత

supreme court two children petition
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో స్వర్గీయ ఎన్టీఆర్ జీవితం ఆధారంగా “లక్ష్మీస్ ఎన్టీఆర్” తెరకెక్కిన విషయం తెలిసిందే. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొన్న ఈ చిత్రం గతనెల 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వస్తోంది. అయితే ఒక వ్యక్తి ఈ సినిమాలోని సన్నివేశాలు, డైలాగులు తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని, ఎన్నికలు ముగిసేంత వరకు సినిమాపై స్టే ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా,  “లక్ష్మీస్ ఎన్టీఆర్”ను ఆంధ్రప్రదేశ్ లో విడుదల చెయ్యకుండా ఏప్రిల్ 3 వరకు ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది.
సినిమా ప్రివ్యూను న్యాయమూర్తులు చూశాక, తదుపరి నిర్ణయం తీసుకుంటామని కోర్టు తెలిపింది. దీంతో అనుకున్న సమయానికి ఆంధ్రాలో సినిమాను విడుదల చేయలేకపోయిన వర్మ తెలంగాణాలో మాత్రం విడుదల చేశారు. ఇప్పుడు ఏపీ హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేయాలని చిత్రనిర్మాత రాకేష్ రెడ్డి పిటిషన్‌ దాఖలు చేశారు.

Related posts