సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తోన్న “లక్ష్మీస్ ఎన్టీఆర్” సినిమాకు ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతంగా హైప్ వచ్చేసింది. ఈ సినిమా ఈనెల 22న ప్రేక్షకుల ముందుకు వస్తుండగా… రోజుకో పోస్టర్, టీజర్ లతో హడావిడి చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పాటలు, రెండు ట్రైలర్లు విడుదల చేసిన వర్మ ఇప్పుడు భారీగా సినిమా ఆడియో విడుదల వేడుకను నిర్వహించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ ఈవెంట్ కి ”వెన్నుపోటు అలియాస్ ఎన్టీఆర్ నైట్” అనే పేరు కూడా పేతేశాడు. “లక్ష్మీస్ ఎన్టీఆర్” ఆడియో రిలీజ్ ఈవెంట్ కడపలో ఒక బహిరంగ సభలో చెయ్యబడుతుందని, త్వరలోనే ఈవెంట్ డేట్ వెల్లడిస్తానని వర్మ తెలిపారు. ”నిజంగా నిజమైన ఎన్టీఆర్ అభిమానులకు బహిరంగ ఆహ్వానం” అంటూ ట్వీట్ చేశాడు వర్మ.
లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆడియో రిలీజు ఈవెంట్ కడప లో ఒక గొప్ప బహిరంగ సభలో చెయ్యబడుతుంది ..ఈవెంట్ పేరు
“వెన్ను పోటు” అలియాస్ ఎన్టీఆర్ నైట్ .
ఈవెంట్ డేటు అతి త్వరలో తెలియచెయ్యబడుతుంది ..జై ఎన్టీఆర్ #LakshmiNTR pic.twitter.com/ocVYUrkD6t
— Ram Gopal Varma (@RGVzoomin) March 16, 2019
ఇక “లక్ష్మీస్ ఎన్టీఆర్” సినిమా విడుదలను అడ్డుకోవాలని చాలా విధాలుగా ప్రయత్నించింది టీడీపీ పార్టీ. ఈ సినిమాలో చంద్రబాబు నాయుడుని నెగెటివ్ గా చూపించారని, ఎన్నికలు పూర్తయ్యే వరకు సినిమా విడుదలను ఆపాలంటూ కొందరు టీడీపీ నేతలు ఎలెక్షన్ కమిషనర్ కి ఫిర్యాదు చేశారు. సినిమా మార్చి 22న విడుదల కానున్న నేపధ్యంలో ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే విషయంపై అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పుడు ఈ సినిమా విడుదలను అడ్డుకోవడం కుదరదని తేల్చి చెప్పేసింది ఈసీ. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ నిజంగా ఓటర్లను ప్రభావితం చేసే అంశాలు సినిమాలో ఉంటే… విడుదల తరువాత చర్యలు తీసుకుంటామని, విడుదల ఆపడం కుదరదని తేల్చేశారు. కాబట్టి మార్చి 22న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల కావడం పక్కా అన్నమాట.
Election commission cannot take action against release of #LakshmiNTR https://t.co/c1x965K1nu
— Ram Gopal Varma (@RGVzoomin) March 15, 2019