telugu navyamedia
సినిమా వార్తలు

“లక్ష్మీస్ ఎన్టీఆర్”కు హైకోర్టులో చుక్కెదురు

Lakshmi's-NTR

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన “లక్ష్మీస్ ఎన్టీఆర్” ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని మే 29న తెలంగాణాలో విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను పొందింది. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం సినిమా విడుదలపై కోర్టు స్టే విధించింది. ఈ నేపథ్యంలోనే చిత్రం విడుదలకు సంబంధించి పిటిషన్ ఈరోజు ఏపీ హైకోర్టులో విచారణకు వచ్చింది. సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉన్నందువల్ల దీనిపై ఇప్పటికిప్పుడే విచారణ జరపలేమని తెలిపింది. ఈ సినిమా ప్రివ్యూని కూడా ఇప్పుడు చూడలేమని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈనెల 9వ తేదీకి వాయిదా వేస్తున్నట్లుగా కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఏపీలో ఈ చిత్ర విడుదలకు మళ్లీ బ్రేక్ పడింది. ఈరోజు సినిమా రిలీజ్ విషయంలో ఓ నిర్ణయం వ్యక్తమవుతుందని ఆశించిన చిత్ర నిర్మాత రాకేశ్ రెడ్డికి చుక్కెదురైంది. దీంతో సినిమా విడుదలపై ఉత్కంఠ కొనసాగుతోంది. మరోపక్క సినిమా విడుదల కాకపోవడంతో తమకు నష్టాలు వచ్చాయని డిస్ట్రిబ్యూటర్లు హైకోర్టులో కేసు వేయడానికి సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.

Related posts