telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

విరుచుకుపడ్డ .. లక్ష్మీపార్వతి, ..ఇక ఉపేక్షించే ప్రసక్తే లేదు..

lakshmiparvati fire on chandrababu

దివంగత ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి పై లైంగిక వేధింపుల కేసు వచ్చిన విషయం తెలిసిందే. ఆమె నేడు దానిపై తీవ్రంగా స్పందించారు. గత 25 ఏళ్లుగా చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు చేసిన అవమానాలను తాను భరిస్తూ వచ్చానని తెలిపారు. చంద్రబాబు, లోకేశ్ ను త్వరలో జైలుకు పంపకపోతే తాను ఎన్టీఆర్ భార్యనే కాదని శపథం చేశారు. ఎన్టీఆర్ మరణానికి కూడా తానే కారణమని తనపై తప్పుడు అభియోగాలు మోపి వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష్మీపార్వతి తనను వేధిస్తున్నారని కోటీ అనే వ్యక్తి ఇటీవల మీడియా ముందుకు రావడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై లక్ష్మీపార్వతి స్పందిస్తూ.. తన వ్యక్తిత్వాన్ని హీనంగా చూపే కుట్రలు సాగుతున్నాయని చెప్పారు.

‘గతంలో మీ నాయకుడు నామీద ఇలాంటి నిందలే వేశాడు. కానీ నా భర్త(ఎన్టీఆర్) అవి నిజం కాదని నిరూపించి మరీ నన్ను పెళ్లి చేసుకున్నాడు. అది నాకు గర్వకారణం. ఏంట్రా.. అసలు మీరేం చేస్తారు? 30 ఏళ్ల వయసులోనే నాపై ఎలాంటి మచ్చ లేదు. 68 ఏళ్ల వయసులో నాపై మచ్చ ఆపాదిస్తారా?’ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల విడుదలైన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాతో ప్రజలకు వాస్తవాలు తెలిశాయని వ్యాఖ్యానించారు. కుటుంబం పరువు కోసమే ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నానని తెలిపారు. తనపై ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తే ఇకపై చట్టపరంగా ముందుకు వెళతానని హెచ్చరించారు.

ఓ కోవర్టుతో టీడీపీ నేతలు తనపై నిందలు వేయించారని ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి తెలిపారు. ఈ విషయంలో చట్టపరంగా ముందుకు వెళుతున్నానని చెప్పారు. లక్ష్మీపార్వతి తనను లైంగికంగా వేధిస్తోందని ఆమె సహాయకుడు కోటి ఆరోపించిన నేపథ్యంలో ఈ మేరకు స్పందించారు. లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన కోటి వెనుక ఎవరు ఉన్నారో తేలిపోతుందన్నారు. తనపై ఆరోపణలు చేసిన కోటి చంద్రబాబు, బాలకృష్ణతో కలిసి ఉన్న ఫొటోలు ఇప్పుడే బయటకు వస్తున్నాయని వ్యాఖ్యానించారు. కోటి విషయమై లక్ష్మీపార్వతి మాట్లాడుతూ..‘దండుపాళ్యం డైరెక్టర్ ఓ అభిమానిగా ఇతడిని వెంటపెట్టుకుని ఓరోజు మా ఇంటికి వచ్చాడు. అమ్మా వీడు(కోటి) జూనియర్ ఆర్టిస్ట్ గా వేషాలు వేస్తుంటాడు’ అని చెప్పాడు. దీనితో నేను మర్యాదగా పలకరించాను. ఈ సందర్భంగా మాదీ వినుకొండే అమ్మా.. ఏదైనా పనుంటే చెప్పండి అని కోటి అడిగాడు. దీనితో తాను‘ ఏం వద్దులే బాబూ.. అసెంబ్లీలో మందులు ఇస్తారు మాకు. మా అమ్మకు తెచ్చిపెట్టు’ అని చెప్పాను. ప్రతీనెలా మా అమ్మకు మందులు తెచ్చి ఇచ్చేవాడు.

ఇలా మా అమ్మకు బిస్కెట్ ప్యాకెట్లు తెచ్చి ఇస్తూ ఇంట్లో వాళ్లకు దగ్గరయ్యాడు. ఇదంతా ఓ ప్లాన్ ప్రకారం జరిగిందని ఇప్పుడు అర్థమవుతోంది’ అని తెలిపారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల తర్వాత చాలా మంది ప్రజలు అమితంగా గౌరవిస్తున్నారని, అభిమానం పెరిగిందని చెప్పారు. కుటుంబ గౌరవం కోసమే తాను మౌనంగా ఉన్నాననీ, తాను గుట్టు విప్పితే చంద్రబాబు, బాలకృష్ణ కుటుంబాల చరిత్ర రోడ్డున పడుతుందని హెచ్చరించారు. జగన్ అధికారంలోకి రాగానే తానేంటో చూపిస్తానని హెచ్చరించాడు.

Related posts