రేపు దేశంలో ఏడువిడతల ఎన్నికలలో ఆఖరి ఘట్టం. దీనితో ఒకరోజు ముందే ఎగ్జిట్ పోల్స్ గురించి హడావుడి జరుగుతుంది. దీనితో లగడపాటి ఎప్పటిలాగానే తన అంచనాలను చూచాయగా చెప్పారు. రేపు పూర్తిగా అంకెలతో సహా వెల్లడిస్తానని నేడు మీడియా సమావేశంలో వెల్లడించారు. మొత్తానికి ఏపీలో ప్రజలు సైకిల్ వైపు మొగ్గుచూపుతున్నారని, తెలంగాణాలో కారు దే హావ అని హింట్ ఇచ్చాడు లగడపాటి.//లగడపాటి అంచనాలలో మరిన్ని విషయాలు : కేంద్రంలో హంగ్, పవన్ పార్లమెంట్ లో అడుగు పెడతాడు. కానీ కనీసం చిరంజీవికి వచ్చిన సంఖ్య కూడా పవన్ కు రాకపోవడం ఖాయం. //
ఇప్పటివరకు ఫలితాలు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తూ .. ఎవరి అంచనాలతో వాళ్ళు తృప్తిగా ఉన్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటే మాత్రం కొందరికి గుండెలలో రైళ్లు పరిగెట్టక మానవు. అనుకున్నది ఒకటి అయినది ఒకటి అన్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ ఉండొచ్చు. రేపు సాయంత్రం హడావుడి అంతా ఎగ్జిట్ పోల్స్ తోనే. ఇక నేటి లగడపాటి ఒకరోజు హడావుడి కూడా ప్రభావం చూపుతుందా.. లేదా అంటే, గత అనుభవాలు చూసుకున్నప్పుడు.. ఆయన అంచనాలు విఫలం అయినట్టుగా కూడా తెలుస్తుంది. మరి పీఠం ఎవరిని వరించేది 23 రాత్రికి మాత్రమే తెలుస్తుంది. అప్పటివరకు ఈ ఎగ్జిట్ పోల్స్ కూడా బూటకమే. చూద్దాం ఏ పుట్టలో ఏ పాముందో.. ఎవరి జ్యోస్యం నిజం అవనుందో..!!
కేంద్ర నిధులను రాబట్టడంలో జగన్ విఫలం: యనమల