సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. దీంతో రాజకీయ నేతలు ఎన్నికల పై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుతో మాజీ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ మంగళవారం భేటీ అయ్యారు. గుంటూరు నగరంలోని చుట్టుగంట సెంటర్లోగల ఓ హోండా షోరూమ్లో వీరిద్దరూ ఏకాంతంగా చర్చలు జరిపారు. కోడెల-లగడపాటి భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మరికొద్ది రోజుల్లోనే ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో వీరిద్దరూ ఏకాంతంగా చర్చలు జరపడం పట్ల పలు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సత్తెనపల్లిలో పోటీపై లగడపాటి సర్వే చేశారా? అనే కోణంలో రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఈసారి సత్తెనపల్లి లేదా నరసారావుపేట నుంచి కోడెల పోటీ చేస్తారని ఆయన సన్నిహితవర్గాలు చెబుతున్నాయి.
రాబోయే పదేళ్లలో స్టాలిన్ దేశానికీ ప్రధాని అవుతారు…